‘దిశ’ యాక్ట్ నాతోటే మొదలు కావాలి: టీడీపీ ఎమ్మెల్యే భవానీ

| Edited By:

Dec 17, 2019 | 11:30 AM

‘దిశ’ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. మద్యం నియంత్రణపై సభలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పోస్టులు వెల్లువెత్తాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణపై మహిళలు మాట్లాడకూడదా..? నేనేదో తప్పుగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, అందులో కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆమె అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఎలాగైనా.. […]

దిశ యాక్ట్ నాతోటే మొదలు కావాలి: టీడీపీ ఎమ్మెల్యే భవానీ
Follow us on

‘దిశ’ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. మద్యం నియంత్రణపై సభలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పోస్టులు వెల్లువెత్తాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణపై మహిళలు మాట్లాడకూడదా..? నేనేదో తప్పుగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, అందులో కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆమె అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఎలాగైనా.. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు ఎమ్మెల్యే భవానీ. ‘దిశ చట్టం నా నుంచే మొదలు కావాలని.. అసెంబ్లీ సాక్షిగా’ నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని భవానీ అన్నారు. దీనిపై వైసీపీ నాయకురాలు హోంమంత్రి సుచరిత స్పందిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే భవానీపై సోషల్ మీడియాలో పెట్టిన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.