తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వుయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితకథ ఆధారంగా తెలుగు తెరపై రూపొందిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్గా ఈ చిత్రాన్ని నిర్మించారు హీరో రామ్చరణ్. గాంధీ జయంతి రోజున విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల తెలుగురాష్ట్రల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ మూవీ కోసం మెగాస్టార్ బాలీవుడ్కు సైతం వెళ్లి ప్రమోషన్స్ చేశారు. సైరా మూవీలో చిరంజీవి, బిగ్ బీ అమితాబ్లు కీలకపాత్ర పోషించడం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్గా చెబుతున్నారు.
అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం దేశ వ్యాప్తంగా పలుచోట్లకు తిరుగుతున్నారు హీరో చిరంజీవి. అయితే బాలీవుడ్ ప్రమోషన్స్లోనూ, హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రమే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కనిపించారు. మిగిలిన భాషల్లో జరిగిన కార్యక్రమ వేదికలపై ఆయన లేకపోవడంతో ఒకరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కనిపించకపోవడానికి, సినిమా జయపజయాలకు మధ్య లింక్ పెట్టే ఆలోచన ఏదైనా చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి మాత్రం బాలీవుడ్తో పాటు ఇప్పటివరకు వచ్చిన ఏ మూవీలో లేని విధంగా మూవీ క్లైమాక్స్ ఉంటుందన్నారు. చిత్రం విడుదలకు మరో రెండురోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఆయన ఈ మూవీని డైరెక్ట్ చేయడం తనకు ఎంతో సంతోషాన్నిందని చెబుతున్నారు. అదే విధంగా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చి, నిర్మాత పెట్టిన పెట్టుబడితో పాటు అంతకుమించిన లాభం వస్తే తాను మరింత ఆనందపడతానంటూ చెప్పుకొస్తున్నాడు.