సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్పై డైరెక్టర్ భారతీ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆడియో ఫంక్షన్లలో సినిమా హీరోలు రాజకీయాల గురించి మాట్లాడం.. మంచిది కాదని ఆయన విమర్శలు చేశారు. వీటి వలన చిత్ర పరిశ్రమ నష్టాల పాలవుతుందని ఆయన పేర్కొన్నారు. దర్బార్ ఫెయిల్యూర్స్తో డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రూ.50 కోట్ల సినిమాకి రూ.400 కోట్ల లాభం వచ్చిందని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. రూ.400ల కోట్ల వ్యాపారం జరిగితే రూ.350 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని ఆయన వ్యాఖ్యానించారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.