ధోనీ ఇంట్లో చోరీ… ముగ్గురి అరెస్ట్!

| Edited By:

Jun 07, 2019 | 4:53 PM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటితో పాటు పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీకి నోయిడాలోని సెక్టార్ 104లో ఒక ఇల్లు ఉంది. దాన్ని ఆయన విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది. మరమ్మత్తులు జరుగుతోన్న ఈ ఇంట్లో నుంచి ఖరీదైన ఎల్‌ఈడీ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో విక్రమ్ సింగ్ […]

ధోనీ ఇంట్లో చోరీ... ముగ్గురి అరెస్ట్!
Follow us on

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటితో పాటు పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీకి నోయిడాలోని సెక్టార్ 104లో ఒక ఇల్లు ఉంది. దాన్ని ఆయన విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది. మరమ్మత్తులు జరుగుతోన్న ఈ ఇంట్లో నుంచి ఖరీదైన ఎల్‌ఈడీ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో విక్రమ్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు.

ధోనీ ఇల్లు ఉన్న ప్రాంతంలోనే మరిన్ని చోరీలు జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది బ్యాటరీలు, మూడు ఇన్వెర్టర్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఐదు ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాహుల్, బబ్లూ, ఇక్బాల్‌గా పోలీసులు గుర్తించారు.