కేంద్ర ప్రభుత్వానికి షాక్‌.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం..!

| Edited By:

Mar 13, 2020 | 8:42 PM

ఢిల్లీ అసెంబ్లీ జాతీయ జనాభా రిజిస్టర్, జాతీయ పౌరుల రిజిస్టర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిపై చర్చించడానికి జరిగిన ఒకరోజు ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వానికి షాక్‌.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం..!
Follow us on

ఢిల్లీ అసెంబ్లీ జాతీయ జనాభా రిజిస్టర్, జాతీయ పౌరుల రిజిస్టర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిపై చర్చించడానికి జరిగిన ఒకరోజు ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బిల్లుపై మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలామందికి బర్త్‌ సర్టిఫికెట్లు లేవని అన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.

కేంద్ర మంత్రులకు ప్రభుత్వం జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాలు ఉంటే.. నిర్ధారించాలని ముఖ్యమంత్రి సవాలు చేశారు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 7గురికి మాత్రమే బర్త్‌ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్‌ కోరారు. కాగా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కేరళ తొలుత తీర్మానం చేసింది.

[svt-event date=”13/03/2020,8:40PM” class=”svt-cd-green” ]