ఆ రోజుల్లో కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతి లేదు..

|

Oct 02, 2020 | 8:11 PM

ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం దుర్గం చెరువుపైన ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి ఇప్పుడు జనాల ప్రాణాలమీదకి తెస్తోంది. చీకటి పడితే చాలు విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతున్న కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు జనం అక్కడికి చేరుకుంటున్నారు.

ఆ రోజుల్లో కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతి లేదు..
Follow us on

ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం దుర్గం చెరువుపైన ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి ఇప్పుడు జనాల ప్రాణాలమీదకి తెస్తోంది. చీకటి పడితే చాలు విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతున్న కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు జనం అక్కడికి చేరుకుంటున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. వేగంగా వస్తున్న వాహనాలను సైతం గుర్తించకుండా.. రోడ్డుపైనే ఆటలాడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోనూ ఈ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్ దుర్గం చెరువుపై ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వస్తున్న సందర్శకులు ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో అధికారులు వారాంతాల్లో బ్రిడ్జిపైకి వాహనాల అనుమతిని నిషేధించారు.

ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు.. :

కేబుల్ బ్రిడ్జి పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుండి సోమవారం 6 గంటల వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు. ప్రతిరోజు రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేయనున్నారు. వాహనాలు తిరిగే సమయంలో బ్రిడ్జిపై అటు ఇటు క్రాస్ చేయడం తగదని సూచించారు. బ్రిడ్జ్ రైలింగ్ పై నిలబడరాదు. కేబుల్ బ్రిడ్జి పై బర్త్ డే సెలబ్రేషన్స్ …బ్రిడ్జిపై కూర్చుని మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.