IPL 2020 : చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్..

|

Sep 30, 2020 | 6:48 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు గుడ్ న్యూస్. వరుస ఓటములతో ఢీలాపడిన చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టులో చేరేందుకు ఇద్దరు కీలక ఆటగాళ్లు సిద్ధమయ్యారు. అయితే స్టార్‌ ప్లేయర్లు ఫిట్‌నెస్‌ సాధించారని చెన్నై ఆడే తర్వాతి పోరులో బరిలో దిగేందుకు

IPL 2020 : చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్..
Follow us on

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు గుడ్ న్యూస్. వరుస ఓటములతో ఢీలాపడిన చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టులో చేరేందుకు ఇద్దరు కీలక ఆటగాళ్లు సిద్ధమయ్యారు. అయితే స్టార్‌ ప్లేయర్లు ఫిట్‌నెస్‌ సాధించారని చెన్నై ఆడే తర్వాతి పోరులో బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారని ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. తొడకండరాల నొప్పి నుంచి రాయుడు కోలుకున్నాడని వెల్లడించారు. తర్వాతి మ్యాచ్‌లో అతడు ఆడతాడని తెలిపాడు. ట్రైనింగ్‌లో అతడు బాగానే పరుగెత్తుతున్నాడని ప్రకటించారు. నెట్స్‌లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేశాడని విశ్వనాథన్‌ తెలిపారు.

అయితే చెన్నై ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో గాయం కారణంగా ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌తో టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన రాయుడు గాయంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.