స్టైరిన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది: సీఎస్‌ఐఆర్

| Edited By:

May 12, 2020 | 3:04 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాద బాధితులపై ఆ ప్రభావం

స్టైరిన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది: సీఎస్‌ఐఆర్
Follow us on

CSIR-NEEIR Study: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాద బాధితులపై ఆ ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని సీస్‌ఐఆర్, ఎన్ఈఈఐఆర్ నిపుణులు వెల్లడించారు. కాగా… బాధితులకు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మంగళవారం వెల్లడించారు.

వివరాల్లోకెళితే.. బాధితుల ఆరోగ్యంపై ప్రభుత్వం ఇప్పటికే పూర్తి బాధ్యత తీసుకుందని తెలిపారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చిందని చెప్పారు. బాధితులకు రానున్న రోజుల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా, అవి ఏ స్థాయిలో ఉన్నా కూడా… వారికి జీవితకాలం పాటు ఉచిత చికిత్సనందించడం జరుగుతుందని గౌతం రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రధమ కర్తవ్యమని భావించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… స్టైరిన్ గ్యాస్‌ను తరలించేందుకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.

కాగా.. ప్రమాదానికి కారణమైన స్టైరిన్ గ్యాస్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల నేపధ్యంలో దక్షిణ కొరియాకు తరలిప్తున్నట్లు గౌతం రెడ్డి వెల్లడించారు. ఇక రాష్ట్రంలో… రానున్న రోజుల్లో మరో ప్రమాదానికి తావు లేకుండా… అనుమానం ఉన్న అన్ని పరిశ్రమలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.