Covid 19: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ 27 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 906కు చేరింది. అలాగే ఈ మహమ్మారి బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 83 మంది కోలుకోగా.. 804 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు కేరళ, మహారాష్ట్రల్లో కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అత్యధికంగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కేరళలో 176 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 162 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో కరోనా కారణంగా నలుగురు చనిపోగా.. కర్ణాటకలో ముగ్గురు మరణించగా.. గుజరాత్ లో కూడా ముగ్గురు ప్రాణాలు విడిచారు. మధ్యప్రదేశ్లో ఇద్దరు, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, జమ్ముకాశ్మీర్, వెస్ట్ బెంగాల్, బీహార్, హిమాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్కరు చొప్పున ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి.
రాష్ట్రాలు వారీగా నమోదైన కేసులు ఇలా ఉన్నాయి..
For More News:
తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
హైదరాబాద్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..
డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు
గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..
కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..
Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..