చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య

|

Oct 16, 2020 | 9:19 AM

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య
Follow us on

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మోసం మల్లేష్ , మోసం నర్మద అనే దంపతులు సమీపంలోని పోచమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్ పేర్కొన్నారు. కాగా, నర్మద బెల్లంపల్లి సోషల్ వెల్పేర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, మల్లేష్ ఓ ఛానల్ లో రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.