సికింద్రాబాద్ సర్కిల్లోని నేరేడ్మెట్ డివిజన్లో ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున హైకోర్టు ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కోర్టు నిర్ణయానుసారం లెక్కింపును నిలిపివేసారు. కాగా రిటర్నింగ్ అధికారి ఓట్ల లెక్కింపు వివరాలను ఎస్ఈసీకి పంపారు. కోర్టు నిర్ణయంతో ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు.