చంచల్‌గూడ జైలుకు అవినీతి అధికారి లావణ్య

| Edited By:

Jul 21, 2019 | 12:52 AM

ఆదాయానికి మించి అక్రమాస్తులు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో లావణ్య ఇంట్లో లభ్యమైన నగదును చూసి షాక్ తిన్నారు. ఈ తనికీల్లో దాదాపు రూ.93లక్షల నగదు, భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆమె బంధువుల బ్యాంక్ ఎక్కౌంట్లలో కూడా భారీగా నగదు […]

చంచల్‌గూడ జైలుకు అవినీతి అధికారి లావణ్య
Follow us on

ఆదాయానికి మించి అక్రమాస్తులు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో లావణ్య ఇంట్లో లభ్యమైన నగదును చూసి షాక్ తిన్నారు. ఈ తనికీల్లో దాదాపు రూ.93లక్షల నగదు, భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆమె బంధువుల బ్యాంక్ ఎక్కౌంట్లలో కూడా భారీగా నగదు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. లావణ్య ఇంటినుంచి నగలు, నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ తహశీల్దారుగా అవార్డు పొందిన లావణ్యపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిని రుజువులతో సహా నిరూపించే క్రమంలో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. తనికీల్లో పెద్ద ఎత్తున నగదు లభించడంతో అమెను అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్య‌ను రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు.రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారం ముగియంతో…వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లావణ్య, అనంతయ్యను చంచల్‌గూడ జైలుకు తరలించారు.