ఏపీ సర్కార్ రికార్డ్…లక్ష దాటిన కోవిడ్-19 టెస్టులు

|

May 01, 2020 | 1:25 PM

కోవిడ్ 19 పరీక్షలు టెస్టులు చేయ‌డంలో ఇప్ప‌టికే దేశంలో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న ఆంధ్ర‌ప‌దేశ్ మ‌రో ఘ‌న‌త సొంతం చేసుకుంది. రాష్ట్రం మొత్తం మీద‌ ఇప్పటి వరకు లక్షకు పైగా కోవిడ్-19 టెస్టుల‌ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. రికార్డు స్థాయిలో 1,02,460 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 7,902 శాంపిల్స్‌ను టెస్టు చెయ్య‌గా.. 60 మందికి కోవిడ్-19 సోకిన‌ట్లు శుక్రవారం ఉదయం ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం […]

ఏపీ సర్కార్ రికార్డ్...లక్ష దాటిన కోవిడ్-19 టెస్టులు
Follow us on

కోవిడ్ 19 పరీక్షలు టెస్టులు చేయ‌డంలో ఇప్ప‌టికే దేశంలో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న ఆంధ్ర‌ప‌దేశ్ మ‌రో ఘ‌న‌త సొంతం చేసుకుంది. రాష్ట్రం మొత్తం మీద‌ ఇప్పటి వరకు లక్షకు పైగా కోవిడ్-19 టెస్టుల‌ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. రికార్డు స్థాయిలో 1,02,460 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు పేర్కొంది.

ఇక గడిచిన 24 గంటల్లో 7,902 శాంపిల్స్‌ను టెస్టు చెయ్య‌గా.. 60 మందికి కోవిడ్-19 సోకిన‌ట్లు శుక్రవారం ఉదయం ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,463 కు చేరుకుంది. తాజాగా, 82 మంది కోలుకుని హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 403కు చేరుకుందని వెల్ల‌డించింది.

కాగా ఈ మ‌హ‌మ్మారి వైరస్‌ బారినపడి గడిచిన 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో క‌రోనాతో మొత్తం మరణించిన వారి సంఖ్య 33కు చేరుకుందని పేర్కొంది. ప్రస్తుతం ఏపీలో 1,027 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.