Coronavirus Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 45,516 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 7,822 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,586కి చేరుకుంది. వీటిల్లో 76,377 యాక్టివ్ కేసులు ఉండగా.. 88, 672 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 1537 మంది మరణించారు.
ఇక గడిచిన 24 గంటల్లో 5,786 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది వైరస్ కరణంగా మరణించారు. అటు జిల్లాల వారీగా నమోదైన కేసులు చూస్తే.. అనంతపురం 953, చిత్తూరు 240, తూర్పుగోదావరి 1113, గుంటూరు 573, కడప 576, కృష్ణ 240, కర్నూలు 602, నెల్లూరు 500, ప్రకాశం 364, శ్రీకాకుళం 495, విశాఖపట్నం 1049, విజయనగరం 677, పశ్చిమ గోదావరిలో 440 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 03/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,63,691 పాజిటివ్ కేసు లకు గాను
*85,777 మంది డిశ్చార్జ్ కాగా
*1,537 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 76,377#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sIME6W5ya2— ArogyaAndhra (@ArogyaAndhra) August 3, 2020