Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 685 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,68,749కి చేరింది. ఇందులో 7427 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,54,326 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 4 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,996కు చేరుకుంది. ఇక నిన్న 1094 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,01,09,708 సాంపిల్స్ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 18, చిత్తూరు 95, తూర్పుగోదావరి 70, గుంటూరు 87, కడప 30, కృష్ణా 146, కర్నూలు 10, నెల్లూరు 39, ప్రకాశం 30, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 71, విజయనగరం 9, పశ్చిమ గోదావరి 77 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,361కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 828 మంది కరోనాతో మరణించారు. అటు గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. అలాగే రికవరీ శాతం కూడా పెరుగుతోంది.
#COVIDUpdates: 01/12/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,65,854 పాజిటివ్ కేసు లకు గాను
*8,51,431 మంది డిశ్చార్జ్ కాగా
*6,996 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,427 #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QiQp3AsjSg— ArogyaAndhra (@ArogyaAndhra) December 1, 2020