గుంటూరు లక్ష్మీపురంలో తల్లీ, బిడ్డ మరణం కలకలం రేపింది. తొమ్మిది నెలల పసిపాపను అపార్టుమెంట్పై నుంచి కింద పడేసి, అనంతరం తల్లి మనోజ్ఞ కూడా పైనుంచి దూకి ప్రాణాలు విడిచినట్లు సమాచారం. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ఉదయం మనోజ్ఞ డెడ్బాడీకి డాక్టర్లు కరోనా టెస్టులు చేశారు. ఫలితం పాజిటివ్గా వచ్చినట్టు వైద్యులు మీడియాకు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి మనోజ్ఞ భర్త, అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్ 306, 498ఏ కింద కేసు నమోదు చేశారు. చనిపోయిన మనోజ్ఞ భర్త, అత్తమామలు..ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. మనోజ్ఞ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఇద్దరినీ చంపేసి కింద పడేశారని ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని మనోజ్ఞ తమ్ముడు కార్తీక్ బలంగా వాదిస్తున్నాడు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు.
Also Read :
“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”
‘డియర్ కామ్రేడ్’ అరుదైన ఘనత : ఇండియాలోనే నెం.1