జువైనల్ హోమ్‌లో కరోనా.. ఎనిమిది మందికి పాజిటివ్

|

Aug 11, 2020 | 9:54 AM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేటలోని జువైనల్ హోమ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. జువైనల్ హోమ్‌లో ఉంటున్న ఎనిమిది మంది బాలురకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు.

జువైనల్ హోమ్‌లో కరోనా.. ఎనిమిది మందికి పాజిటివ్
Follow us on

కరోనా వైరస్ ఎవరిని వదలడంలేదు. మెల్ల మెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇప్పటి వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికే పరిమితమైన కరోనా ఇళ్లల్లో ఉన్నవారిని సైతం అంటుకుంటుంది. అటు జైళ్లలో ఉన్న ఖైదీలను సైతం తాకుతోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేటలోని జువైనల్ హోమ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. జువైనల్ హోమ్‌లో ఉంటున్న ఎనిమిది మంది బాలురకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఏలూరు సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. తొలుత హోమ్ సూపరింటెండెంట్‌కు, తరువాత ఒక టీచర్‌కు కరోనా సోకిందని… వారి నుంచి బాలురకు సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీధి బాలురు, చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారికి జువైనల్ హోమ్‌లో వసతి కల్పిస్తుంటారు. ఇక జువైనల్ హోమ్‌ను పూర్తి శానిటైజ్ చేసిన అధికారులు అందులో ఉన్న పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు.