Breaking : అనంతపురం జిల్లాలో 8 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్..

|

Jun 22, 2020 | 10:25 PM

అనంతపురం జిల్లా క‌రోనా క‌ల‌వ‌రం రేపుతోంది. తాజాగా ధర్మవరంలో ఎనిమిది మంది గర్భిణులకు కోవిడ్-19 సోకిన‌ట్టు తేల‌డంతో క‌ల‌క‌లం రేగింది. ఈ నెల 19న ధర్మవరంలో గర్భిణులకు కరోనా టెస్టులు చేశారు వైద్య అధికారులు. తాజాగా వచ్చిన ఫలితాల్లో వారిలో 8 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ నేప‌థ్యంలో కోవిడ్ సోకిన గర్భిణులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్​డీటీ కొవిడ్ హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. వారికి క‌రోనా ఎలా సోకింద‌నే […]

Breaking : అనంతపురం జిల్లాలో  8 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్..
Follow us on

అనంతపురం జిల్లా క‌రోనా క‌ల‌వ‌రం రేపుతోంది. తాజాగా ధర్మవరంలో ఎనిమిది మంది గర్భిణులకు కోవిడ్-19 సోకిన‌ట్టు తేల‌డంతో క‌ల‌క‌లం రేగింది. ఈ నెల 19న ధర్మవరంలో గర్భిణులకు కరోనా టెస్టులు చేశారు వైద్య అధికారులు. తాజాగా వచ్చిన ఫలితాల్లో వారిలో 8 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ నేప‌థ్యంలో కోవిడ్ సోకిన గర్భిణులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్​డీటీ కొవిడ్ హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. వారికి క‌రోనా ఎలా సోకింద‌నే విష‌యంపై ఆరా తీస్తున్నారు అధికారులు. పరీక్షల కోసం వారు ధర్మవరం గ‌వ‌ర్న‌మెంట్ ఆసుపత్రికి వెళ్లినట్లు బంధువులు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 443 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందినా కేసులు 392 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 51గా ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7,451కి చేరింది. ఇందులో 3,903 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,437 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 111 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.