Corona Positive To Achhannaidu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈఎస్ఐ స్కాం కేసులో ప్రస్తుతం రిమాండులో ఉన్న ఆయనకు కరోనా సోకినట్లు గుంటూరు రమేష్ ఆసుపత్రికి ఏపీ హైకోర్టుకు లేఖ ద్వారా తెలియజేసింది. రెండు రోజులుగా జలుబుతో బాధపడుతున్న అచ్చెన్నాయుడుకు హాస్పిటల్ సిబ్బంది కరోనా టెస్టు చేయడంతో.. పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. కాగా ఈఎస్ఐ స్కాం కేసులో బెయిల్ కోసం అచ్చెన్నాయుడు గతంలో రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమవడం తెలిసిన విషయమే.
Also Read:
తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్లో మొదటి కేసు నమోదు.
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..