షాకింగ్.. ఇండియాలో ఒక్క‌రోజే క‌రోనాతో 2003 మ‌ర‌ణాలు

|

Jun 17, 2020 | 10:45 AM

ఇండియాలో క‌రోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో కొత్త‌గా 10974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 354065కి చేరింది. కాగా క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది.

షాకింగ్.. ఇండియాలో ఒక్క‌రోజే క‌రోనాతో 2003 మ‌ర‌ణాలు
Follow us on

ఇండియాలో క‌రోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో కొత్త‌గా 10,974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. కాగా క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది. నిన్న ఒక్క‌రోజే 2003 మంది కోవిడ్-19 కార‌ణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 11,903కి చేరింది. డెత్ రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం గ‌మ‌నార్హం.  కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య‌ 1,86,934గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,55,227 ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 4వ ప్లేసులో‌ ఉంది.

కాగా మహారాష్ట్రలో అత్య‌ధికంగా 5,537 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​లో 1,533 మంది, ఢిల్లీలో 1,837 మంది, బెంగాల్​లో 495 మంది, మధ్యప్రదేశ్​లో 476 కరోనాతో మృతి చెందారు.