దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. లాక్ డౌన్ లోనూ మహమ్మారి వైరస్ తీవ్రంగానే వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ఈ వైరస్ వలన 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్తగా 1543 మంది కోవిడ్-19 సోకింది.
ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించిన వివరాలు
మొత్తం కేసులు: 29435
యాక్టివ్ కేసులు: 21632
మరణాలు: 934
కోలుకున్నవారు: 6869
ఇండియాలో కరోనాకు కేరాఫ్ గా మారిన మహారాష్ట్రలో కేసులు 8590కి చేరాయి. అక్కడ 1282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 369 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్లో కరోనా మృతుల సంఖ్య 162కు పెరిగింది. మధ్యప్రదేశ్లో 110, దిల్లీలో 54, రాజస్థాన్లో 46 చొప్పున ప్రాణాలు కోల్పోయారు.