రాజ్‌భవన్‌లో కరోనా కలకలం

|

Jul 29, 2020 | 11:06 PM

కరోనా మహమ్మారి రోజు రోజుకు రెట్టింపవుతోంది. డిశ్చర్జీ అవుతున్నవారి సంఖ్య పెరుగుతున్న కొత్త కేసులతో అన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. తాజాగా ఏపీ రాజ్ భవన్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మొత్తం 15 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రాజ్ భవన్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేశారు. రాజ్ భవన్ భద్రతగా ఉన్న 72 మంది సిబ్బందిని మార్చి కొత్త సిబ్బందిని నియమించారు. కొత్త సిబ్బంది ఒకేసారి […]

రాజ్‌భవన్‌లో కరోనా కలకలం
Follow us on

కరోనా మహమ్మారి రోజు రోజుకు రెట్టింపవుతోంది. డిశ్చర్జీ అవుతున్నవారి సంఖ్య పెరుగుతున్న కొత్త కేసులతో అన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. తాజాగా ఏపీ రాజ్ భవన్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మొత్తం 15 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రాజ్ భవన్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేశారు. రాజ్ భవన్ భద్రతగా ఉన్న 72 మంది సిబ్బందిని మార్చి కొత్త సిబ్బందిని నియమించారు. కొత్త సిబ్బంది ఒకేసారి రావడంతో రాజ్‌భవన్ బయట హడావుడి నెలకొంది.