ప్రఖ్యాత మెదక్ చర్చికి కరోనా ఎఫెక్ట్, లక్షల సంఖ్యలో వచ్చే యేసయ్య భక్తులు.. ఈసారి వందల సంఖ్యలో కూడా లేని వైనం

|

Dec 25, 2020 | 1:17 PM

Christmas: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణలోని మెదక్ చర్చికి కరోనా ఎఫెక్ట్ పట్టుకుంది. త్యాగమూర్తి ఏసుప్రభువు పుట్టిన రోజైన..

ప్రఖ్యాత మెదక్ చర్చికి కరోనా ఎఫెక్ట్, లక్షల సంఖ్యలో వచ్చే యేసయ్య భక్తులు.. ఈసారి వందల సంఖ్యలో కూడా లేని వైనం
Follow us on

Christmas: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణలోని మెదక్ చర్చికి కరోనా ఎఫెక్ట్ పట్టుకుంది. త్యాగమూర్తి ఏసుప్రభువు పుట్టిన రోజైన క్రిస్మస్ పర్వదినాన ప్రతి ఏటా లక్షల సంఖ్యలో వచ్చే యేసయ్య భక్తులు,ఈసారి వందల సంఖ్యలో కూడా కనిపించలేదు. తాజాగా వచ్చిన స్ట్రైయిన్ వైరస్, బ్రిటన్ కరోనా ఎఫెక్ట్ తో మెదక్ చర్చ్ వైపు జనాలు రావడం లేదు. దీంతో మెదక్ చర్చి వద్ద జరిగే క్రిస్మస్ వేడుకల్లో జన సందోహం కనిపించలేదు. మెదక్ చర్చిలో ప్రతియేటా క్రిస్మస్ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు దేశ విదేశాల నుండి వచ్చి పాల్గొనేవారు. అయితే, ఈసారి మాత్రం అలా ఇక్కడ కనిపించలేదు.