Corona Andhra: ఏపీ కరోనా.. కొత్తగా 1933 కేసులు.. ఆ జిల్లాలోనే అత్యధికం..

|

Jul 12, 2020 | 4:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది.

Corona Andhra: ఏపీ కరోనా.. కొత్తగా 1933 కేసులు.. ఆ జిల్లాలోనే అత్యధికం..
Follow us on

Corona Andhra: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో 13,428 మంది చికిత్స పొందుతుండగా.. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్నఒక్క రోజే 19 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది.

కాగా, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు కాగా.. అనంతపురం 129, చిత్తూరు 159, గుంటూరు 152, కడప 94, కృష్ణా 206, కర్నూలు 237, నెల్లూరు 124, విశాఖ 49, ప్రకాశం 134, శ్రీకాకుళం 145, విజయనగరం 138 పశ్చిమ గోదావరి జిల్లాలో 79 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 11,53,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు కర్నూలు(3405), గుంటూరు(3019), అనంతపురం(3290) జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు కాగా, కర్నూలు(101), కృష్ణా(80) జిల్లాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి.