రామలింగారెడ్డి ఆశయాలకు అనుగుణంగా దుబ్బాక అభివృద్ధిః సుజాత

|

Oct 22, 2020 | 4:50 PM

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సోలిపేట్ రామలింగారెడ్డి సతీమణి సుజాత ఊరూరా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.

రామలింగారెడ్డి ఆశయాలకు అనుగుణంగా దుబ్బాక అభివృద్ధిః సుజాత
Follow us on

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సోలిపేట్ రామలింగారెడ్డి సతీమణి సుజాత ఊరూరా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని సోలిపేట సుజాత అన్నారు. గురువారం చేగుంట మండలం వల్లభపూర్, తాండ, నర్సంపల్లి, చిట్టోజిపల్లి, పొలంపల్లి, పోతన్ శెట్టి పల్లి గ్రామాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చాను. దుబ్బాకను రామలింగారెడ్డి అభివృద్ధి చేశాడు. నాకు మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకరన్నల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అన్నారు. కాగా, సోలిపేట సుజాతకు గ్రామ, గ్రామాన కార్యకర్తు ఘన స్వాగతం పలికారు. అయా గ్రామస్తులు బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.