త్రిపుల్ తలాక్‌ బిల్లుకు కాంగ్రెస్, ఎంఐఎం చెక్

| Edited By: Srinu

Jun 21, 2019 | 6:27 PM

లోక్‌స‌భ‌లో ఇవాళ ట్రిపుల్ త‌లాక్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అయితే మరోసారి ఈ బిల్లును కాంగ్రెస్, ఎంఐఎంలు వ్యతిరేకించాయి. కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన వెంట‌నే.. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ త‌లాక్ ప‌ద్ధ‌తికి తాను వ్య‌తిరేక‌మేనని.. అయితే దాన్ని క్రిమిన‌ల్ చ‌ర్య‌గా చూడడాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. బిల్లులో ఉన్న అంశాలను అన్ని వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు విస్త‌రించేలా చూడాల‌ని ఆయన సూచించారు. అయితే బిల్లు గ‌తంలో లోక్‌స‌భ‌లో పాసైంద‌ని, కానీ రాజ్య‌స‌భ‌లో […]

త్రిపుల్ తలాక్‌ బిల్లుకు కాంగ్రెస్, ఎంఐఎం చెక్
Follow us on

లోక్‌స‌భ‌లో ఇవాళ ట్రిపుల్ త‌లాక్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అయితే మరోసారి ఈ బిల్లును కాంగ్రెస్, ఎంఐఎంలు వ్యతిరేకించాయి. కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన వెంట‌నే.. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ త‌లాక్ ప‌ద్ధ‌తికి తాను వ్య‌తిరేక‌మేనని.. అయితే దాన్ని క్రిమిన‌ల్ చ‌ర్య‌గా చూడడాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. బిల్లులో ఉన్న అంశాలను అన్ని వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు విస్త‌రించేలా చూడాల‌ని ఆయన సూచించారు.

అయితే బిల్లు గ‌తంలో లోక్‌స‌భ‌లో పాసైంద‌ని, కానీ రాజ్య‌స‌భ‌లో గ‌ట్టెక్క‌క‌పోవ‌డం వ‌ల్ల దాన్ని మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టాల్సి వ‌చ్చింద‌ని మంత్రి ర‌విశంక‌ర్ తెలిపారు. ఇక ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ కూడా ఈ బిల్లును వ్య‌తిరేకించారు. ముస్లిమేత‌ర వ్య‌క్తుల‌కు ఏడాది కాలానికి శిక్షి వేస్తున్నార‌ని, కానీ ముస్లిం మ‌తానికి చెందిన మ‌గ‌వారికి మాత్రం మూడేళ్లు శిక్ష‌ను వేస్తున్నార‌ని ఆరోపించారు