దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసే విషయమై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) శుక్రవారం ప్రకటన చేసింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీపై ఎవరేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. త్వరలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాగా.. దుబ్బాక నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూయడంతో ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే బీజేపీ కూడా అభ్యర్థిని నిలపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది.
Read More:
అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!
సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!