Warangal Kaloji Narayana Rao University:వరంగల్ లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ లో అక్రమాలు జరిగాయని, అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు హెల్త్ యూనివర్సిటీని ముట్టడించారు. కాగా, ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.దీంతో కొందరు గోడలు దూకి యూనివర్సిటీ లోకి ప్రవేశించారు.
కాగా, మెడికల్ సీట్ల కేటాయింపులలో యూనివర్సిటీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీగా తరలివచ్చారు. అయితే ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. యూనివర్సిటీలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ వద్ద కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.
Special Trains: దేశంలో మరో ఆరు స్పెషల్ ట్రైన్స్.. ఈనెల 10 నుంచి కాచిగూడ – విశాఖ ప్రత్యేక రైలు