ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్కు సీఎం జగన్ శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్దికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా జగన్ వెల్లడించారు.
ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ను ఏపీకి నూతన గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒడిశా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
Congratulations and Best Wishes to Sri Biswabhusan Harichandan Ji on appointment as Hon’ble Governor of Andhra Pradesh. Looking forward to working with you for the development of our state.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 16, 2019