అమెరికా పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూల్స్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు సీఎం జగన్ విందులో పాల్గొంటారు.
వాషింగ్టన్ డీసీ చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, స్వాగతం పలికిన భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు pic.twitter.com/b8OGYUnk29
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2019