పోలవరంపై సీఎం జగన్ మరో రివ్యూ..

| Edited By:

Jun 22, 2019 | 12:25 PM

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి రివ్యూ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన ఆయన.. ఇవాళ మరోసారి ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు. ఇరిగేషన్, సీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖలపై సమీక్ష చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులపై సీఎం జగన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు సీఎం జగన్.. కాఫర్ డ్యాం పనులపై, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎగువ […]

పోలవరంపై సీఎం జగన్ మరో రివ్యూ..
Follow us on

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి రివ్యూ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన ఆయన.. ఇవాళ మరోసారి ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు. ఇరిగేషన్, సీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖలపై సమీక్ష చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులపై సీఎం జగన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా.. తాజాగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు సీఎం జగన్.. కాఫర్ డ్యాం పనులపై, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎగువ కాఫర్ డ్యాం పనులు ఎంతవరకూ పూర్తయ్యాయని, భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇది కొట్టుకుపోకుండా తీసుకున్న చర్యలు ఏమిటన్నారు..? అధికారులను ప్రశ్నించారు సీఎం.