నేడు దర్మకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా దాసరిని పలువురు సినీ ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘దాసరి’ అనే పదాన్ని వర్ణిస్తూ ట్వీట్ చేశారు.
‘దా’.. దానంలో కర్ణుడు,
‘స’.. సమర్ధతలో అర్జునుడు,
‘రి’.. రిపువర్గమేలేని ధర్మరాజు
మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది’.
ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం మన మధ్య సజీవంగానే ఉంటుందని ట్వీట్ చేశారు చిరంజీవి. కాగా ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా దాసరి నారాయణ రావు రికార్డు సృష్టించారు. దీనితో పాటే రచయిత, నిర్మాత, నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్నారు. 1942 మే 4న జన్మించిన దాసరి.. 2017 మే 30న తుదిశ్వాస విడిచారు. చిరు-దాసరి కాంబినేషన్లో ‘లంకేశ్వరుడు’ సినిమా వచ్చింది.
దా..దానంలో కర్ణుడుమీరు
స..సమర్ధతలో అర్జునుడుమీరు
రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు
మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది.
ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది.
This was my last memory of Guruvu garu.We miss u Sir #LastPressmeet #Dasari pic.twitter.com/XBOUmIqLyW
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2020
Read More: షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్ చూసి షాక్ అయిన చంద్రబాబు!