గుండెలు పిండేస్తున్న చిరంజీవి సర్జా చివరి మెసేజ్

|

Jun 11, 2020 | 1:43 PM

చిరంజీవి సర్జా చనిపోయే ముందు తన మిత్రుడితో ట్విట్టర్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో.." రేపు ఏం జరుగుతుందో తెలియదు.. ఫ్రెండ్స్‌తో కలిసి వారం టూర్‌ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను అని రాసుకొచ్చారు. ఇక అదే అతని చివరి మెస్సెజ్ కావటం విశేషం...

గుండెలు పిండేస్తున్న చిరంజీవి సర్జా చివరి మెసేజ్
Follow us on

కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం దక్షిణాది సినీలోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మరణం ప్రతి ఒక్కరిని షాక్‌కి గురి చేసింది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ ప్రముఖలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. చిరంజీవి సర్జాతో తమకు ఉన్న జ్ఞాపకాలని కొందరు నెమరువేసుకుంటున్నారు. అయితే చిరంజీవి సర్జా చివరి సారి తన ప్రాణ మిత్రుడు ప్రజ్వల్ దేవరాజ్‌తో వాట్సప్‌లో చేసిన చిట్ చాట్ ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది.

చిరంజీవి సర్జా చనిపోయే ముందు తన మిత్రుడితో ట్విట్టర్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో..” రేపు ఏం జరుగుతుందో తెలియదు.. ఫ్రెండ్స్‌తో కలిసి వారం టూర్‌ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను అని రాసుకొచ్చారు. ఇక అదే అతని చివరి మెస్సెజ్ కావటం విశేషం.

అయితే.. జూన్ 7వ తేదీన తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి మొదలైంది. కాసేపట్లోనే ఆ నొప్పి మరింత పెరిగిపోవడంతో స్థానిక అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు. కాసేపటికే చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూశారు.

2018లో మేఘనా రాజ్‌ని చిరంజీవి సర్జా వివాహం చేసుకొన్నారు. కాగా, చిరంజీవి సర్జా ..హీరో అర్జున్‌కి మేనళ్లుడు అనే విషయం తెలిసిందే.