ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి… ఎందుకు?

| Edited By:

Oct 16, 2019 | 6:39 PM

సైరా సినిమా బంపర్‌ హిట్‌ కావటంతో విజయనందాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఏపి ముఖ్యమంత్రి జగన్‌ ను చిరంజీవి తన కుటుంబ సమేతంగా కలిసారు. తన సినిమాను చూడమని ఆహ్వనించారు. అలాగే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కూడా ఈ చిత్రాన్ని చూసి, అద్బుతంగా ఉందని కితాబిచ్చారు. కాగా చిరంజీవి బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రధాని మోదీని కలిసి సైరా సినిమాను చూడాల్సిందిగా కోరారు. అనంతరం కేంద్ర […]

ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి... ఎందుకు?
Follow us on

సైరా సినిమా బంపర్‌ హిట్‌ కావటంతో విజయనందాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఏపి ముఖ్యమంత్రి జగన్‌ ను చిరంజీవి తన కుటుంబ సమేతంగా కలిసారు. తన సినిమాను చూడమని ఆహ్వనించారు. అలాగే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కూడా ఈ చిత్రాన్ని చూసి, అద్బుతంగా ఉందని కితాబిచ్చారు. కాగా చిరంజీవి బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రధాని మోదీని కలిసి సైరా సినిమాను చూడాల్సిందిగా కోరారు. అనంతరం కేంద్ర హోమంత్రి అమిత్‌షా ను కలవనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్లి అక్కడ సైరా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.  మోడీ, అమిత్ షా లో ఒకరు లేదా ఇద్దరు సైరా సినిమా ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, మెగాస్టార్ ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిరంజీవి కూడా చెప్పారు. కానీ, తాను ప్రస్తుతం సినిమాల్లోనే ఉంటానని అన్నారు. కాగా, ఇప్పుడు సైరా సినిమా ప్రమోషన్స్ కోసం బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, సీఎం రమేష్ లతో కలిసి ఢిల్లీ వెళ్లారు.