మోదీ, జిన్‌పింగ్ భేటీ ఖరారు

| Edited By:

Jun 10, 2019 | 12:09 PM

భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ. జిన్‌పింగ్‌ల భేటీ దాదాపు ఖరారైంది. SCO సదస్సు వేదికగా వీరిరువురు సమావేశం కానున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో జూన్ 13,14 తేదీల్లో షాంఘై సహకార సంఘం సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా మోదీ-జిన్‌పింగ్ మధ్య భేటీ ఉంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కాంగ్ ప్రకటించారు. చైనా ఆధ్వర్యంలో ఏర్పడిన SCOలో ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. 2017లో ఇందులో భారత్, పాకిస్థాన్ చేరాయి. కాగా, మోదీ-జిన్‌పింగ్ భేటీ […]

మోదీ, జిన్‌పింగ్ భేటీ ఖరారు
Follow us on

భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ. జిన్‌పింగ్‌ల భేటీ దాదాపు ఖరారైంది. SCO సదస్సు వేదికగా వీరిరువురు సమావేశం కానున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో జూన్ 13,14 తేదీల్లో షాంఘై సహకార సంఘం సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా మోదీ-జిన్‌పింగ్ మధ్య భేటీ ఉంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కాంగ్ ప్రకటించారు. చైనా ఆధ్వర్యంలో ఏర్పడిన SCOలో ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. 2017లో ఇందులో భారత్, పాకిస్థాన్ చేరాయి. కాగా, మోదీ-జిన్‌పింగ్ భేటీ అవుతారని ఇటీవల చైనాలోని భారత దౌత్యవేత్త విక్రమ్ మిస్త్రీ కూడా తెలిపారు.