సీఎం కేసీఆర్ ఆశీర్వదం తీసుకున్న కవిత

|

Oct 12, 2020 | 6:41 PM

నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రిని క‌విత క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఆశీర్వదం తీసుకున్న కవిత
Follow us on

Kalvakuntla Kavitha : నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రిని క‌విత క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వదం తీసుకున్నారు కవిత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కవిత వెంట ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క‌విత‌ చరిత్ర సృష్టించారు. 88 శాతం ఓట్లు సాధించి రికార్డు విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో మొత్తం 823 ఓట్లలో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి. ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అయింది. కాంగ్రెస్, బీజేపీలు డిపాజిట్ కోల్పోయాయి. సీఎం కేసీఆర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు క‌విత ధ‌న్య‌వాదాలు తెలిపారు.