ఏపీలో చికెన్‌ ధర ఆల్‌టైం హై..! దేశం మొత్తం మీద ఇదే అత్యధికం..!

| Edited By:

May 15, 2020 | 6:10 PM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. పౌల్ట్రీ రైతులు కోళ్ల

ఏపీలో చికెన్‌ ధర ఆల్‌టైం హై..! దేశం మొత్తం మీద ఇదే అత్యధికం..!
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి తగ్గించడంతో కోళ్ల లభ్యత లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ లో కేజీ చికెన్ రూ. వరకు పలుకుతోంది. రంజాన్ నెలలో చికెన్ వినియోగం పెరగడం కూడా రేటు పెరిగేందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

మరోవైపు.. కోవిద్-19 భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ.25-50 లోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు ఇచ్చినా తీసుకునేవారు లేరు. పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు. దీనివల్ల కొన్నిచోట్ల కోళ్లను మేపలేక మిన్నకుండిపోయారు. మరికొన్ని చోట్ల గొయ్యి తీసి పాతేశారు. ఈ పరిణామాలతో 60శాతం కోళ్ల ఫారాల్లో కోళ్లే లేకుండా పోయాయి. ఇంటిగ్రేషన్‌ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్‌లను పెంచడం ఆపేశాయి.

Also Read: రోనా అదుపులోకి వచ్చాకే స్కూళ్ళు..: కేంద్ర మంత్రి  

Also Read: తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపా.. పొడిగింపా..!