బరిలోకి బాబు.. 14న ఏం చేయబోతున్నారంటే ?

| Edited By: Srinu

Nov 11, 2019 | 6:21 PM

ఏపీలో కొనసాగుతున్న ఇసుక ఆందోళన మరింత ఉధృతం చేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇసుకతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భవనాల విక్రయం వంటి అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి నేతలు దేవినేని ఉమ, కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో సమావేశమయ్యారు. నవంబర్ 14న రంగంలోకి దిగేందుకు చంద్రబాబు నాయుడు ముహూర్తం నిర్ణయించారు. […]

బరిలోకి బాబు.. 14న ఏం చేయబోతున్నారంటే ?
Follow us on

ఏపీలో కొనసాగుతున్న ఇసుక ఆందోళన మరింత ఉధృతం చేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇసుకతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భవనాల విక్రయం వంటి అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి నేతలు దేవినేని ఉమ, కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో సమావేశమయ్యారు.

నవంబర్ 14న రంగంలోకి దిగేందుకు చంద్రబాబు నాయుడు ముహూర్తం నిర్ణయించారు. ఇసుక విధానంలోని లోపాలను హైలైట్ చేయడంతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం పేరిట తెలుగు భాషను చంపేస్తున్నారని, రాష్ట్రంలోని విలువైన, మూల్యమైన ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆయా అంశాలను కూడా హైలైట్ చేసేందుకు విజయవాడ వేదికగా నిరాహార దీక్షను నిర్వహించాలని తలపెట్టారు. ఈ విషయంపైనే సోమవారం టిడిపి నేతలు కేశినేని భవన్‌లో సమావేశమయ్యారు.

ఇసుక కొరత పై ఈ నెల 14 న ధర్నా చౌక్ లో చంద్రబాబు నిరాహారదీక్ష చేపడతారని, ఈ దీక్షకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతోపాటు సామాన్య ప్రజలు హాజరు కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమ పిలుపునిచ్చారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఉమ ఆరోపించారు. రాష్ట్రంలో విలువైన భూములు, ఆస్తుల అమ్మకానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు.

ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని, ఈ నెల 14 చంద్రబాబు నిరాహార దీక్ష తర్వాత స్టేట్ గెస్ట్ హౌస్, భూముల అమ్మకాలపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఉమ వెల్లడించారు. జగన్ ఇంగ్లీషు మీడియం పై బాద్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని టిడిపి నేతలంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు. తెలుగుదేశం పార్టీలో.. తెలుగు కనిపిస్తోంది కనుక రాష్ట్రంలో తెలుగు లేకుండా చేయాలనే జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు.