ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇల్లు మారుతున్నారా? తాజా పరిణామాలు చూస్తే నిజమేననిపిస్తుంది. గత వారం రోజుల్లో జరిగిన పరిణామాలతో చంద్రబాబు తీవ్ర మనస్ధాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసిన తర్వాత లింగమనేని గెస్ట్హౌస్లో నివసిస్తున్న చంద్రబాబు దాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కరకట్టపై నిర్మించిన కట్టడాలన్నీ అక్రమంగా నిర్మించినవేనని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే చంద్రబాబు నివసిస్తున్న గెస్ట్హౌస్ కూడా కూల్చివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో బాబు ఇల్లు మారాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇందుకోసం విజయవాడలోని ఓ ఇంటికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే లింగమనేని గెస్ట్హౌస్కు వెళ్లే రోడ్డు తవ్వేయడంతో చంద్రబాబు ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఎదరైంది. మరోవైపు చంద్రబాబు గౌరవంగా ఆ ఇంటిని ఖాళీ చేస్తే మంచిదని వైసీపీ మంత్రులు ఇప్పటికే సూచించారు.