ప్రముఖ గాయని, పాప్ సింగర్ స్మిత.. 20 ఏళ్ళ కెరీర్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అయితే ఆ ప్రముఖుల్లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్మితను అభినందిస్తూ లేఖ పంపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. చంద్రబాబు లేఖను ట్విట్టర్లో షేర్ చేసిన స్మిత.. ‘ఇది నిజంగా నాకు సర్ప్రైజ్. ధన్యవాదాలు చంద్రబాబు గారు’ అని ట్వీట్ చేశారు.
స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు ఆహ్లాదం కలిగిస్తున్నందుకు అభినందనలు తెలియజేసిన చంద్రబాబు.. తెలుగులో ఆమె మొట్టమొదటి పాప్ ఆల్బమ్ను రూపొందించడం గర్వకారణమన్నారు.
This truly came as a pleasant surprise ? I thank @ncbn garu for his wishes ?? #AJourney #20Years pic.twitter.com/AwPPeaUEFV
— Smita (@smitapop) July 20, 2019