కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.. 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 7:11 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5734 కు పెరిగింది. కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.. 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..
Follow us on

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5734 కు పెరిగింది. కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్రాలకు 15 వేల కోట్ల అత్యవసర ప్యాకేజీని విడుదల చేయనున్నది. కరోనాపై పోరుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించింది. కరొనాపై రాష్ట్ర అధికారులతో కలిసి ఈ బృందాలు పనిచేయనున్నాయి. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ కు ప్రత్యేక బృందాలను కేంద్రం పంపించింది.