కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు నూతన మార్గదర్శకాలు…

|

Oct 16, 2020 | 2:50 PM

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నూతన మార్గదర్శకాలను కేంద్రం జారీచేసింది.  ఇందులో భాగంగా వినోదపు పార్కులు, ఫుడ్‌కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు నూతన మార్గదర్శకాలు...
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నూతన మార్గదర్శకాలను కేంద్రం జారీచేసింది.  ఇందులో భాగంగా వినోదపు పార్కులు, ఫుడ్‌కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్‌ ఏరియాల్లో వినోదపు పార్కులు తెరవకుండా చూడాలని సూచించింది.

కరోనా వ్యాప్తి జరగకుండా వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వినోద కేంద్రాలకు, పార్కుల్లోకి సందర్శకులు విశ్రాంతి, వినోదం కోసం పెద్దసంఖ్యలో వస్తారు కాబట్టి కరోనా నివారణ చర్యలు పాటించడం చాలా ముఖ్యమని గుర్తు చేసింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ.

కనీసం ఆరడుగుల భౌతికదూరం పాటించండంతో పాటు మాస్క్‌ తప్పనిసరి అని పేర్కొంది. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి మరోసారి గుర్తుచేసింది. లేకుంటే ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడంపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. 65 ఏళ్లు పైబడిన, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది.

ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం అనుమతించకూడదని పేర్కొంది. ఫుడ్‌కోర్టు సిబ్బంది లేదా వెయిటర్లు మాస్క్‌లు, గ్లోవ్స్‌ ధరించాలని తేలిపింది.

స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసివేయాలని తెలిపింది. నీటితో కూడిన వినోదం అందించే పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అటువంటిచోట్ల నీటి వడపోత, క్లోరినేషన్‌ తప్పనిసరిగా పాటిస్తున్నారో లేదో.. పర్యవేక్షించాలని కోరింది.