ఏపీ రాజధాని అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారిటీ..

| Edited By: Srinu

Feb 04, 2020 | 4:55 PM

రాజధాని అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా ఈ క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ ఆన్సర్ ఇచ్చారు. 23.04.2015 నాటి జి.ఓ. ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉందని తెలుసని..ప్రస్తుతం మూడు రాజధానులపై కూడా మీడియా నివేదికలు వచ్చాయని తెలిపారు. అయితే రాజధాని ఎక్కడ […]

ఏపీ రాజధాని అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారిటీ..
Follow us on

రాజధాని అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా ఈ క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ ఆన్సర్ ఇచ్చారు. 23.04.2015 నాటి జి.ఓ. ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉందని తెలుసని..ప్రస్తుతం మూడు రాజధానులపై కూడా మీడియా నివేదికలు వచ్చాయని తెలిపారు. అయితే రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని స్పష్టం చేశారు.