ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు

| Edited By:

Jul 10, 2020 | 10:16 PM

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. చైనాకు సంబంధించిన 59 యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిలో ప్రజల్లో బాగా పాపులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కూడా ఉంది. దీంతో టిక్‌టాక్‌లో వీడియోలు

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు
Follow us on

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. చైనాకు సంబంధించిన 59 యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిలో ప్రజల్లో బాగా పాపులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కూడా ఉంది. దీంతో టిక్‌టాక్‌లో వీడియోలు షేర్ చేస్తూ పాపులరైన వారికి ఏం చేయాలో తోచకుండా పోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్.. సరికొత్త వీడియో షేరింగ్ ఫీచర్‌ ‘రీల్స్’ను లాంచ్ చేసింది. దీనిలో 15 సెకన్ల వ్యవధి ఉండే వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా దీనిలో జాయిన్ అయిపోయి తమ ‘రీల్స్’ షేర్ చేశారు. ఇలా చేసిన వారిలో ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఉంది.

వివరాల్లోకెళితే.. తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కూడా కొందరు సెలెబ్రిటీలు ‘రీల్స్’లో చేరిపోయారు. వారిలో ప్రముఖ నటి సమంతా అక్కినేని, హీరోయిన్స్ హన్సికా మోత్వానీ, ప్రగ్యా జైస్వాల్, సింగర్ గీతా మాధురి, యూట్యూబ్ స్టార్ జాహ్నవి దాసెట్టి ఉన్నారు. వీరంతా తమ తమ రీల్స్(15 సెకన్ల నిడివి ఉండే వీడియోలు)ను షేర్ చేశారు. ఈ వారమే ఇన్‌స్టాగ్రామ్ ఈ సరికొత్త ఫీచర్‌ను కొత్తగా పరిచయం చేసింది. దీన్ని హైదరాబాద్‌లో తొలుత ఉపయోగించిన వారిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని జాహ్నవి తెలిపారు. సమంత, గీతా మాధురి తదితరులు కూడా తమ రీల్స్ వీడియోలను షేర్ చేశారు.