ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన దేశభద్రతపై నూతన కేబినెట్ కమిటీ ఏర్పాటైంది. ఈ కీలకమైన ప్యానల్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న ఈ కమిటీలో రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల, ఆర్ధిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా ఉన్న ఈ ప్యానల్లో రాజ్నాధ్ సింగ్, అమిత్ షా, జైశంకర్, నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు, లేదా కేబినెట్ పునర్ వ్యవస్థీకరించినప్పుడు… భద్రతపై ఈ కేబినెట్ కమిటీ మారుతుంది.