CAA: ‘సీఏఏ’పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Feb 27, 2020 | 9:09 PM

CAA: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి వచ్చినా సరే ఇక్కడి నుంచి పంపించే వారెవరూ లేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా పంపాల్సి వస్తే నేను కూడా మీతో వస్తానని అన్నారు. శేరిలింగంపల్లిలో గురువారం మైనార్టీ సంఘాల వారు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా.. కల్లబొల్లి మాటలతో మీ మధ్యకు వచ్చే బీజేపీ నాయకులపై తిరగబడండి […]

CAA: సీఏఏపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Follow us on

CAA: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి వచ్చినా సరే ఇక్కడి నుంచి పంపించే వారెవరూ లేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా పంపాల్సి వస్తే నేను కూడా మీతో వస్తానని అన్నారు. శేరిలింగంపల్లిలో గురువారం మైనార్టీ సంఘాల వారు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా.. కల్లబొల్లి మాటలతో మీ మధ్యకు వచ్చే బీజేపీ నాయకులపై తిరగబడండి అంటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు గాంధీ. అవసరం ఐతే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో సీఏఏ అమలు కాదని అరికెపూడి గాంధీ స్పష్టంచేశారు.