BSF Officers: భారత్-బంగ్లా సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా జాతీయుడు.. బిఎస్ఎఫ్ అధికారుల కీలక ప్రకటన..

|

Jun 11, 2021 | 8:12 AM

BSF Officers: భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అనుమానంగా కనిపించిన చైనా జాతీయుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్) అధికారులు అదుపులోకి..

BSF Officers: భారత్-బంగ్లా సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా జాతీయుడు.. బిఎస్ఎఫ్ అధికారుల కీలక ప్రకటన..
Bsf Officers
Follow us on

BSF Officers: భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అనుమానంగా కనిపించిన చైనా జాతీయుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని బిఎస్ఎఫ్ అధికారులు గురువారం నాడు అధికారికంగా వెళ్లడించారు. పశ్చిమ బెంగాల్ లోని మల్దా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్న చైనీయుడిని అధికారులు గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అతన్ని అడ్డుకున్నారు.

అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. చైనీయుడు అని తేలింది. దాంతో బిఎస్ఎఫ్ అధికారులు సదరు అజ్ఞాత విదేశీ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని రాక గురించి ఆరా తీశారు. ఇదే విషయాన్ని బిఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇక, చైనీయుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు.. అతన్ని వాచారిస్తున్నాయి. ఉగ్రవాదం, చొరబాటు, తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్… జూలై 1 నుంచి సవరించిన జీతాలు..