భద్రతా బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం

|

Aug 08, 2020 | 10:35 PM

రాజస్థాన్​లోని బోర్డ‌ర్ జిల్లా బాడ్మేర్​ వద్ద దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని బార్డ‌ర్ సెక్యూర‌టీ ఫోర్స్(బీఎస్​ఎఫ్​) మట్టుబెట్టాయి.

భద్రతా బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం
Follow us on

రాజస్థాన్​లోని బోర్డ‌ర్ జిల్లా బాడ్మేర్​ వద్ద దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని బార్డ‌ర్ సెక్యూర‌టీ ఫోర్స్(బీఎస్​ఎఫ్​) మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి గుజరాత్​-రాజస్థాన్​ అంతర్జాతీయ బోర్డ‌ర్‌లో కంచెను దాటి.. భారత భూభాగంలోకి రహస్యంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు దుండగుడు. ఇది గమనించిన భార‌త‌ కాల్పులు జరిపాయి.

‘పగటిపూట పాక్​ ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పడు బీఎస్ఎఫ్​ విఫలమైంది. అయితే, ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో చొరబాటుకు ప్రయత్నించడం ఇదే మొద‌టిసారి. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం దృష్ట్యా బీఎస్ఎఫ్​ అలెర్ట‌య్యింద‌ని.’ అని సైన్యాధికారులు వెల్ల‌డించారు.