ప్రదర్శనకు వచ్చి.. బంగారు టాయిలెట్‌‌నే ఎత్తుకుపోయారు..!

| Edited By:

Sep 15, 2019 | 11:45 AM

దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏకంగా టాయిలెట్‌నే దొంగతనం చేసిన ఘటన బ్లెన్హేమ్ ప్యాలెస్‌లో చోటుచేసుకుంది. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ పుట్టిన దగ్గర.. గుర్తు తెలియని వ్యక్తులు 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌ను ఎత్తుకుపోయారు. ఈ టాయిలెట్‌ను ఆర్టిస్ట్ మారీజియో కాట్టెలాన్ పూర్తిగా బంగారంతో తయారుచేశాడు. ఆక్స్‌ఫర్డ్ షైర్‌లోని వుడ్‌స్టాక్‌లో ఉన్న బ్లెన్ హెయిమ్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో దీన్ని ప్రదర్శన కోసం పెట్టారు. అయితే టాయిలెట్‌ను ఎవరు ఎత్తుకుపోయారనేది ఇంకా తెలియలేదు. భారీ సంఖ్యలో సందర్శకులు […]

ప్రదర్శనకు వచ్చి.. బంగారు టాయిలెట్‌‌నే ఎత్తుకుపోయారు..!
Follow us on

దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏకంగా టాయిలెట్‌నే దొంగతనం చేసిన ఘటన బ్లెన్హేమ్ ప్యాలెస్‌లో చోటుచేసుకుంది. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ పుట్టిన దగ్గర.. గుర్తు తెలియని వ్యక్తులు 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌ను ఎత్తుకుపోయారు. ఈ టాయిలెట్‌ను ఆర్టిస్ట్ మారీజియో కాట్టెలాన్ పూర్తిగా బంగారంతో తయారుచేశాడు. ఆక్స్‌ఫర్డ్ షైర్‌లోని వుడ్‌స్టాక్‌లో ఉన్న బ్లెన్ హెయిమ్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో దీన్ని ప్రదర్శన కోసం పెట్టారు. అయితే టాయిలెట్‌ను ఎవరు ఎత్తుకుపోయారనేది ఇంకా తెలియలేదు. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే.. ఈ దొంగతనం జరిగి వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి 66 ఏళ్ల ఒక ముసాలాయనను అరెస్టు చేశారు. చోరీ జరిగిన ప్రాంతంలో ఇంకా చాలా వస్తువులు పాడయ్యాయి.