దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏకంగా టాయిలెట్నే దొంగతనం చేసిన ఘటన బ్లెన్హేమ్ ప్యాలెస్లో చోటుచేసుకుంది. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ పుట్టిన దగ్గర.. గుర్తు తెలియని వ్యక్తులు 18 క్యారెట్ల బంగారు టాయిలెట్ను ఎత్తుకుపోయారు. ఈ టాయిలెట్ను ఆర్టిస్ట్ మారీజియో కాట్టెలాన్ పూర్తిగా బంగారంతో తయారుచేశాడు. ఆక్స్ఫర్డ్ షైర్లోని వుడ్స్టాక్లో ఉన్న బ్లెన్ హెయిమ్ ప్యాలెస్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లో దీన్ని ప్రదర్శన కోసం పెట్టారు. అయితే టాయిలెట్ను ఎవరు ఎత్తుకుపోయారనేది ఇంకా తెలియలేదు. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే.. ఈ దొంగతనం జరిగి వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి 66 ఏళ్ల ఒక ముసాలాయనను అరెస్టు చేశారు. చోరీ జరిగిన ప్రాంతంలో ఇంకా చాలా వస్తువులు పాడయ్యాయి.