2024లో అధికారం మాదే…

|

Aug 11, 2020 | 1:24 PM

2024లో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఏపీలో పనిచేయాలని సూచించారు. పొలిటికల్ బెనిఫిట్ ను....

2024లో అధికారం మాదే...
Follow us on

BJP Led Government in AP : 2024లో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఏపీలో పనిచేయాలని సూచించారు. పొలిటికల్ బెనిఫిట్ ను సాధించేలా నాయకులు కృషి చేయాలని అన్నారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటే కేంద్రం జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఒక రాజధాని నిర్మాణంలో అవినీతిని బీజేపీ ప్రశ్నించిందని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో మళ్లీ అవినీతి చేస్తే బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.

ఏపీలో బీజేపీ జూనియర్ పార్ట్‌నర్ గా పనిచేయడం వల్లే దెబ్బతిన్నదని… డామినేట్ పార్టీగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో నాయకులు పోరాడాలని అన్నారు. కన్నా భవిష్యత్‌లో మరో బాధ్యత తీసుకుని పనిచేస్తారని అభిప్రాయపడ్డారు. బీజేపీలో ప్రణాళిక ప్రకారమే విధానాలు సాగుతాయని అన్నారు. సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని అన్నారు. 2024లో ఏపీలో అధికారంలోకి వస్తామని ఏదో ఆషామాషీగా చెప్పడం లేదని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ బలపడడం ఖాయమని అన్నారు.

మంగళవారం విజయవాడలో జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలన్నారు. మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూశారు. హైదరాబాద్‌లో ఉండి 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పాం. ఆయన హైదరాబాద్‌ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగిందని’’ రామ్‌మాధవ్‌ విమర్శించారు.